చేర్యాల, జనవరి 31 : సిద్దిపేట జిల్లా చేర్యాల( Cheryala)లో కొన్ని నెలలుగా గంజాయి చాక్లెట్స్(Ganja chocolates) విక్రయిస్తున్న బీహార్ వాసి రాకేశ్కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ మహేం ద్రకుమార్ వివరాల ప్రకారం..రాకేశ్కుమార్ ఏడాదిగా చేర్యాల ఆర్టీసీ బస్స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్స్ తీసుకువచ్చి చేర్యాలలో విక్రయిస్తున్నాడు.
ఎవరికి అనుమానం రాకుండా చాక్లెట్స్ రూపంలో ఉన్న గంజాయిని నిందితుడు ఎక్కువగా ఇదే ప్రాంతంలో పనులు చేసే బీహార్ కార్మికులకు విక్రయిస్తున్నాడు. పోలీసుల దాడుల్లో నిందితుని నుంచి 30 ప్యాకెట్లలో 6కిలోల బరువు గల 1200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాకేశ్కుమార్పై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి సిద్దిపేట కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు.