హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
పోలీసు అధికారులు, సిబ్బంది విశ్వసనీయతను ప్రశ్నించే వైఖరిని ఎంపీ మార్చుకోవాలని హితవు పలికారు. సీపీ రంగనాథ్పై వ్యక్తిగత దూషణ చేయడం సరికాదన్నారు. ఏ కేసులోనూ పోలీసులు ప్రత్యేకంగా ప్రమాణం చేయాల్సిన అవసరం లేదని, నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తామని తామంతా విధుల్లో చేరేటప్పుడే ప్రతిజ్ఞ చేస్తామని తెలిపారు.