హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన విపక్ష పార్టీల ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చివేస్తూ, సమాఖ్య స్ఫూర్తికి మోదీ నాయకత్వంలోని బీజేపీ విఘాతం కలిగిస్తున్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా ఆగ్రహం వ్యక్తంచేశారు. అనకొండలా విపక్ష పార్టీల రాష్ట్ర ప్రభుత్వాలను మింగుతున్నదన్నారు. విపక్ష ప్రభుత్వాలను నయానో భయానో తమ దారికి తెచ్చుకోవడం, లొంగని ప్రభుత్వాలపై ఈడీ, సీబీఐ, ఐటీలను దాడులకు ఉసిగొల్పటం చేస్తున్నదని శనివారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. బీజేపీ తీరుకు జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ఉదంతమే ఉదాహరణ అని పేర్కొన్నారు.