జయశంకర్ భూపాపల్లి : ఆలయ(Temple) అవసరాల కోసమే కాంప్లెక్స్ కట్టాం. అది నా సొంత ఆస్తి కాదు అని భూపాలపల్లి(Bhupalapalli) మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు. చెరువు శిఖం భూముల అక్రమణ ఆరోపణలపై గండ్ర వెంకటరమణరెడ్డిపై పోలీసులు కేసు నమోదు(Case registered) చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుడి నిర్మిస్తే నాపై, నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మె్ల్యే క్యాంపు ఆఫీస్, ఆలయం ఒకే సర్వే నంబర్లో ఉన్నాయన్నారు. నాపై కేసు చేసి జైలుకు పంపుతారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు.