ఆశా వర్కర్లపై ఉక్కుపాదం ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని ఇందిరాపార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

ఆశా వర్కర్లకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐటీయూ నాయకులు, ఆశావర్కర్లు ఇందిరాపార్కు చౌరస్తా వద్ద బైఠాయించడంతో పోలీసులు అరెస్టు చేశారు.
