ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంల శుక్రవారం ఉదయం కె.ఆర్.కె కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్లో సరైన పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 22 ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. వాహనదారులు సరైన పత్రాలు చూపించి వాహనాలను తీసుకువెళ్లాని ఆయన సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.