ఆదిలాబాద్: జిల్లాలోని బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో గురువారం తెల్లవారుజామున నుంచి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లోని నిగిని, కంఠేగావ్, బాబెరా, కైలాష్ టెక్డీ అటవీ ప్రాంతంలో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కూంబింగ్ దళాలు స్టీల్ డబ్బాలో అమర్చిన మందుపాతరను గుర్తించాయి. అయితే అది అప్పటికే శిథిలమై ఉండటంతో చాలా సంవత్సరాల క్రితం పెట్టిఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టులకోసం గాలింపు ముమ్మరం చేశారు.