సిద్ధిపేట : తోగుట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన కేసులను నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్వేత అరెస్టుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బుధవారం మూడు గంటల ప్రాంతంలో ఆకుల వంశీకృష్ణ అనే వ్యక్తి తనపై కాల్పులు జరుపుతున్నట్లు 100 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడన్నారు. 2020లో వంశీకృష్ణ, సాయవ్వపై హత్యా యత్నం జరిగిందని పేర్కొన్నారు.
తనకు ప్రాణ భయం ఉందని భావించిన తరుపతి అనే వ్యక్తి కోర్టు నుంచి బైక్పై వస్తూ హైదరాబాద్ వెళ్తున్న వంశీకృష్ణ, సాయవ్వపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారాడన్నారు. యూపీకి చెందిన వ్యక్తి వద్ద రూ.50వేలకు నిందితుడు తుపాకీ కొనుగోలు చేసి, హత్యకు పథకం వేశాడని చెప్పారు. నిందితులు ఒగ్గు తిరుపతి, శరత్ను అదుపులోకి తీసుకొని.. బైక్, తుపాకీ, కొడవలిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా అక్రమంగా తుపాకులను వినియోగిస్తే సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. నిందితుడు తిరుపతి దుబ్బాక మండలం చల్లాపూర్కు చెందిన వాడన్నారు.