కరీంనగర్ కమాన్ చౌరస్తా, జనవరి 5: కరీంనగర్కు చెందిన ప్రముఖ కవి, నవలా రచయిత రేగులపాటి కిషన్రావు(77) గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన ఇప్పటికే 4 నవలలు, 6 కథా సంకలనాలు, 13 కవితా సంకలనాలు వెలువరించారు. అభ్యుదయ భావాలతో ఆయన రచనలు సా గాయి. 1976లో ‘ఆమె వితంతువు కాదు’, 1978లో ‘పతివ్రత ఎవరు’, 1981లో ‘సంఘర్షణ’, 1982లో ‘ప్రేమకు పెండ్లెప్పుడు’ వంటి నవలలు, కథలను రాశారు. 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కరీంనగర్ రాంనగర్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు.
కిషన్రావు మ రణం సాహిత్య లోకానికి తీరనిలోటని తెలంగాణ సాహిత్య అకాడ మీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ పేర్కొన్నా రు. జిల్లాకు చెంది న కవులతోపాటు డాక్టర్ నలిమెల భాసర్, మాడిశెట్టి గోపాల్, కొత్త అనిల్, గండ్ర లక్ష్మణ్ రావు, గాజుల రవీందర్, నంది శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు.