బంజారాహిల్స్,ఫిబ్రవరి 25: లైంగికదాడికి గురైన బాలిక వివరాలు వెల్లడయ్యేలా వార్తా కథనం ప్రచురించిన తెలుగుప్రభ దినపత్రిక యాజమాన్యంతోపాటు విలేకరిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.
లైంగికదాడి ఘటనలో వివరాలు బయటపెట్టిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులపై ఐపీసీ 228 (ఏ), 23 (2)ఆఫ్ పోక్సో యాక్ట్, 74 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.