వర్ని, నవంబర్ 14: నియోజకవర్గ ప్రజల సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించానని.. మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్ఎస్ బాన్సువాడ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. డబ్బు కోసమే కొందరు బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో ఓటమి పాలైన ఏనుగు రవీందర్రెడ్డి.. బాన్సువాడలో ఏం చేస్తారని ప్రశ్నించారు. ప్రచారంలో పోచారం రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.