కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తాడ్కోల్ శివారులో నిర్మిస్తున్న 500 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం పరిశీలించారు. ఇక్కడ ఇదివరకే 500 బెడ్రూం ఇండ్లను పంపిణీ చేసినట్టు చెప్పారు. అనంతరం బాన్సువాడలో పలు కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో స్పీకర్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. – బాన్సువాడ