జగిత్యాల కలెక్టరేట్, మే 10 : ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడంతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్పై కేసు నమోదు చేశామని జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపాల్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న పట్టణంలో అర్వింద్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి హిందువులకు ప్రమాదకారిగా మారాడని, జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారని జగిత్యాల అర్బన్, రూరల్ మండల ఎలక్షన్ ఎఫ్ఎస్టీ ఇన్చార్జి విజయేంద్రరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎంపీపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.