హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రాజ్భవన్లో ఈ నెల 11న వికసిత్ భారత్-2024 వర్క్షాప్ను నిర్వహిస్తున్నట్టు రాజ్భవన్వర్గాలు వెల్లడించాయి. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఈ వర్క్షాప్లో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రసంగిస్తారని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.
రాష్ట్రంలోని ప్రతి విద్యాసంస్థ నుంచి 10 మంది అధ్యాపకులు, వర్సిటీల వైస్చాన్సలర్లు, ఉన్నత విద్యాసంస్థల అధిపతులు హాజరై, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరాయి.