వరంగల్, జూలై 6 (నమస్తేతెలంగా ణ ప్రతినిధి): గతం లో మంజూరైన రైల్వే వ్యాగన్ పీరియాడిక్ ఓవర్హాల్ (పీవోహెచ్)ను రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్గా అప్ గ్రేడ్ చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే జైన్ తెలిపారు. కాజీపేట మండలం అయోధ్యపురంలోని 160 ఎకరాల్లో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అయోధ్యపురంలో రైల్వే వ్యాగన్ పీవోహెచ్, వ్యాగన్ తయారీ కేంద్ర పరిశ్రమలు ఏర్పాటు చేయనున్న ప్రాంతంలో ఏకే జైన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ శనివారం దీనికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మొద టి దశలో 1,200 ఉద్యోగాల కల్పన ఉంటుందన్నారు. మొదటి ఏడాదిలో 1,200, రెండో ఏడాది నుంచి 2,400 రైల్వే వ్యాగన్లను తయారు చేయనున్న ట్టు చెప్పారు. భవిష్యత్తులో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నా రు. సమావేశంలో సికింద్రాబాద్ డివిజన్ డీఆర్ఎం ఏకే గుప్తా పాల్గొన్నారు.