హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పీఎంవో అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో దాదాపు రూ.25వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కర్ణాటక బెంగళూరు ఎయిర్పోర్ట్లో నిర్మించిన రెండో టర్మినల్ను ఈ నెల 11న ప్రారంభిస్తారు. చెన్నై- మైసూరు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభిస్తారు.
108 అడుగుల ఎత్తయిన నాదప్రభు కెంపెగౌడ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి తమిళనాడు వెళ్తా రు. అక్కడ గాంధీగ్రాం రూరల్ ఇన్స్టిట్యూట్ స్నాతకోత్సవానికి మోదీ హజరవుతారు. మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు విశాఖపట్నంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రాష్ట్రంలో ని రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేస్తారు. అనంతరం పలు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేస్తారు.