జైపూర్, ఫిబ్రవరి 28: రాజస్థాన్లోని అజ్మీర్లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ వేయించుకున్న బాలికలతో ప్రధాని ముచ్చటించారు. ఈ ఇంజెక్షన్ గర్భాశయ క్యాన్సర్కు కారణమైన హెచ్పీవీ నుంచి రక్షణ అందిస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ దవాఖానల వద్ద సింగిల్ డోసు గార్డసిల్ 4 వ్యాక్సిన్ని 14 ఏండ్లలోపు బాలికలకు అందచేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.