Free Bus Scheme | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండని మహిళలే రోడ్డెక్కి నిరసనకు దిగారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో కొద్దిరోజులుగా బస్సులు రద్దీగా మారాయి. దీంతో చాలా బస్టాప్ల్లో మహిళలు కనిపిస్తే బస్ డ్రైవర్లు ఆపకుండానే వెళ్తున్నారని ఇప్పటికే పలువురు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లే బస్సులను తమ వద్ద ఆపడం లేదని నాగర్కర్నూల్ జిల్లా మన్ననూర్లో మహిళలు ఆందోళనకు దిగారు. బస్సులను ఆపకపోవడంతో రహదారిపై బైఠాయించి బస్సులను అడ్డుకున్నారు. ఒక బస్సు ఎక్కి డ్రైవర్, కండక్టర్తో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకంతో తమకు మర్యాద లేకుండా పోతుందని ఆవేదన చెందారు. ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులు కూడా ఆపడం లేదని మండిపడ్డారు. దయచేసి ఈ ఫ్రీ బస్ స్కీమ్ను ఎత్తివేయండని సీఎం రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.