హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా మొకల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్పాయంగ్తో కలిసి అస్సాంలో ‘వృక్షవేద్ అరణ్య’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పచ్చని భవితకు బాటలు వేసి, పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అస్సాంలోని జోర్హట్ అటవీ ప్రాంతం అరుణాచల ద్వీపంలో ఉన్న మొలాయికథోనిలో గురువారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వృక్షవేద్ అరణ్యలో భాగంగా పదివేల మొకలు నాటబోతున్నట్టు జాదవ్పాయంగ్ వెల్లడించారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో-ఫౌండర్ కరుణాకర్రెడ్డి, రితిరాజ్పుకాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జాదవ్పాయంగ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు తరాలకు మనం అందించే అత్యంత విలువైన సంపద వృక్ష సంపద అని, వృక్షాలను కొట్టివేయకుండా పెంచాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. వృక్షాలు కూడా మనుషులలాగే జీవాలని, అవి తాము బతుకుతూ, మనకు బతుకును ఇస్తున్నాయని, వాటిని కాపాడుకోవడం ప్రతి మనిషి బాధ్యత అని చెప్పారు. గ్రీన్ఇండియా చాలెంజ్ ద్వారా సంతోష్కుమార్ పర్యావరణానికి చేస్తున్న కృషికి వెలకట్టలేమని కొనియాడారు. ప్రతి ఒకరూ మూడు మొకలు నాటాలంటూ సంతోష్కుమార్ చేస్తున్న ప్రయత్నం విజయవంతమైందని, దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు.
చెట్లపై జాదవ్పాయంగ్ ప్రేమకు నిదర్శనం: సంతోష్కుమార్
జాదవ్పాయంగ్ వృక్ష వేద అరణ్య కార్యక్రమాన్ని ప్రారంభించడంపై మాజీ ఎంపీ సంతోష్కుమార్ సంతోషం వ్యక్తంచేశారు. చెట్లపై జాదవ్పాయంగ్కు ఉన్న ప్రేమకు నిదర్శనం ఈ కార్యక్రమం అని అభివర్ణించారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రయత్నంలో ప్రతిఒకరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.