హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): మత్స్యకారుల సంక్షేమ కార్యక్రమాల నిర్వహణకు నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్రావును మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ పిట్టల రవీందర్ కోరారు. గురువారం మంత్రిని కలిసి పిట్టల, పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఈ ఏడాది మత్స్య ఫెడరేషన్కు కేటాయించిన రూ.30 కోట్లను విడుదల చేయాలని కోరారు. ఈ నిధులతో మత్స్యకారులకు మొబైల్ ఫిష్ ఔట్లెట్లు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు, చేపల ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్స్ను అందిస్తామని తెలిపారు.