హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): సామాజిక మాధ్యమం ఎక్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోస్టుల పరంపర కొనుసాగుతున్నది. శనివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన ఆయన.. ‘కలిసి నవ శకాన్ని నిర్మిద్దాం’ అంటూ పిలుపునిచ్చారు. తాజాగా ఆదివారం సీఎం రేవంత్రెడ్డితో కలిసి ఉన్న ఫొటోలను వీడియోగా చేసి పోస్ట్ చేశారు. ఓ రోజు భట్టితో మరోరోజు రేవంత్రెడ్డితో వరుస పోస్టులు చేయడం వెనుక ఉద్దేశం ఏంటనే చర్చ జరుగుతున్నది. రేవంత్రెడ్డితోపాటు ఇతర నేతలెవర్నీ పట్టించుకోకుండా శనివారం భట్టితో కలిసి చేసిన పోస్టుపై ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ పోస్టు రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో తొలిరోజు పోస్టుకు సంబంధించి దిద్దుబాటు చర్యల్లో భాగంగానే రెండో రోజు రేవంత్రెడ్డితో కలిసిన ఫొటోను పోస్ట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.