సుల్తాన్బజార్, జూలై 11: విహారయాత్రకు వెళ్లిన ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు హిమాచల్ప్రదేశ్లోని మనాలిలో వరదల్లో చిక్కుకున్నారు. ఇటీవల థర్డ్ ఇయర్ పరీక్షలు రాసిన రోహిత్ సూరి, బానోత కమల్లాల్, శ్రీనివాస్ విహారయాత్ర కోసం హిమాచల్ప్రదేశ్ మీదుగా అమర్నాథ్ యాత్రకు బయలుదేరారు. హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభ త్సం సృష్టిస్తుండడంతో ముగ్గురూ మనాలిలో చిక్కుకుపోయారు. వారి ఆచూకీ గల్లంతు కావడంతో అక్కడి అధికారులు ఢిల్లీలోని రెసిడెంట్ కార్యాలయానికి సమాచారం అందించారు.
విషయం తెలియడంతో మంత్రి హరీశ్రావు విద్యార్థుల కోసం ఆరా తీశారు. వారి గురించి వివరాలు తెలుసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులు గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కనుగొన్నారు. వారు ముగ్గురూ మనాలిలో క్షేమంగా ఉన్నట్టు మంత్రి హరీశ్రావుకు సమాచారం అందించారు. వారిని క్షేమంగా హైదరాబాద్ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను హరీశ్రావు ఆదేశించారు.