హైదరాబాద్ : వరద ముంపు నుంచి ఎస్ఎన్డీపీ ద్వారా (SNDP) శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని నాగమయ కుంట అభివృద్ధి పనులను మంత్రులు తలసాని, మహమూద్ అలీ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..ప్రతి ఏటా వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురవుతూ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఇబ్బందులుల లేకుండా చేస్తామన్నారు.
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా రోడ్లు, సీవరేజ్, ఫ్లై ఓవర్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఉన్నారు.