హైదరాబాద్ : ఖమ్మంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పోలీస్ అధికారులు అత్యంత అద్భుతంగా పనితీరును కనబరిచారని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ ప్రశంసించారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి జిల్లాలోని పోలీసు యూనిట్లు సమష్టిగా పనిచేస్తూ, అద్భుతమైన పనితీరుని కనబరుస్తారని వెల్లడించారు. పోలీస్ యూనిట్ల మధ్య ఉండాల్సింది పోటీతత్వం కాదు. ఐక్యమత్యం ఉండాలని ’ అన్నారు.
ఏ ఒక్క జిల్లాను మరో జిల్లాలతో పోల్చుకోలేమని, దేనికి దాని ప్రత్యేకమైన యూనిట్ ఉంటుందని పేర్కొన్నారు.ఆ జిల్లాకు సంబంధించిన బలాలు, బలహీనతలు అక్కడి పోలీస్ యూనిట్ ఉన్నత అధికారులకు తప్పక తెలుస్తుందని అన్నారు. పోలీస్ శాఖలో ఓ యూనిట్ నుంచి మరో యూనిట్ మధ్యలో పోటీ తత్వం ఉండకూడదని,తమ యూనిట్ పరిధిలోని కష్టనష్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వెల్లడించారు.
ప్రజలకు శాంతి భద్రత ఎటువంటి విఘాతం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. నూతనంగా ఐపీఎస్ అధికారులుగా నియమితులైన అధికారులు నూతన ఉత్తేజంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.ఐజీలు కూడా తమ పరిధిలోని యూనిట్లను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటున్నారని డీజీపీ కొనియాడారు.