వరంగల్ రూరల్ : ప్రతి ఫిర్యాదు పట్ల భ్యాధతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. వరంగల్ కమిషనర్ గా భాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన గీసుగొండ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. సిబ్బంది గృహసముదాయ ప్రాంగణంలో నూతనంగా ఎర్పాటు చేసిన పండ్ల మొక్కల పెంపకంపై పోలీస్ కమిషనర్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లును అభినందించారు.
అనంతరం సన్నిహిత కౌంటర్ పనితీరుకు సంబంధించి సంబంధిత విభాగం ఇంచార్జ్ మహిళా కానిస్టేబుల్ ను రోజు నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ ఐటీ కోర్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతలు, నేర నియంత్రణకోసం తీసుకుంటున్న చర్యలపై స్టేషన్ ఇంచార్జ్ ను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా విధుల్లో రాణించడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలందించించేందుకు రూపొందించబడిన వర్టికల్స్ విధానంపై సిబ్బంది మరింత అవగాహన పెంపొందించేందుకు సిబ్బందికి శిక్షణ అందజేయాల్సి ఉంటుందన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన భాధ్యత మనపై వుందని అన్నారు. ముఖ్యంగా నేరాలను నియంత్రించడం కోసం సీసీ కెమెరాల ఎర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కన్నతల్లి కర్కశత్వం..కూతురు గొంతు కోసిన తల్లి
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
మత్తడి దుంకుతున్న ప్రకాష్ నగర్ చెక్ డ్యాం
రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఐకే రెడ్డి