Minister Jagadish Reddy | ప్రధానికి మోదీకి మూడిందని.. వచ్చే ఎన్నికలకు గుణపాఠం చెప్పేందుకు సన్నద్ధమవుతున్నారని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణలో భవన్లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి కూడా పనికిరాకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల ఎజెండాతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెతున్నారని, ఎత్తుగడల్లో సీఎం కేసీఆర్ దిట్ట అన్నారు.
ఏ రాష్ట్రంలో ఏ సమయంలో ఏ ఎత్తుగడ వేయాలో ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలిసినంతగా మరొకరికి తెలియదని ఆయన స్పష్టం చేశారు. సమయానుకూలంగా ఎత్తుగడలు ఉంటాయని ఆయన తేల్చిచెప్పారు. అలాంటి ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్ర సాధించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సరికొత్త ఎత్తుగడలతోటే దేశ రాజకీయాల్లోకి అని ఆయన తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డి వెంట శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డి, శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్, ఎన్ రవీంద్ర కుమార్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎన్ భాస్కర్ రావు ఉన్నారు.