Elephants | హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : ఉత్తర తెలంగాణ సరిహద్దు జిల్లాల ప్రజలు ఏనుగుల భయంతో గజగజ వణికిపోతున్నారు. ఇటీవల ఏనుగు దాడిలో ఇద్దరు రైతుల మృతి మరువక ముందే.. మహారాష్ట్రలో సంచరిస్తున్న 60-70 ఏనుగుల మంద తెలంగాణలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి రాష్ట్రంలోని కుమ్రుంభీం- ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీడివిజన్లో ఈ ఏనుగులు అడుగుపెట్టొచ్చని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.