Padma Rao Goud | సికింద్రాబాద్ ప్రజల స్పందన ఎలా ఉంది?
ప్రత్యేకంగా ఓట్ల కోసం కాదు.. నిత్యం ప్రజలతోనే ఉంటం. ఇంట్లో కంటే నియోజకవర్గంలోనే ఎకువ తిరుగుతం. పజ్జన్న అంటే ప్రజలు. ఆఫీసులనే ఎక్కువ ఉంట. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే.. ఇంటికి వస్తరు. ఈ విషయం నా నియోజకవర్గ ప్రజలే చెప్తరు.
నియోజకవర్గంలో పోటీ ఎలా ఉండబోతున్నది?
ఎవరు పోటీ చేసినా.. పద్మారావు గౌడ్ గెలుపు ఆగదు. గతం కంటే ఎకువ మెజారిటీ నా నియోజకవర్గ ఓటర్లు ఇస్త్తరన్న నమ్మకం ఉంది.
ఎంత మెజారిటీతో గెలుస్తా అనుకుంటున్నరు?
మూడుసార్లుగా ఒక్కో ఎన్నికకు మెజారిటీ పెంచుకుంటూనే పోతున్న. ఈసారి 50-60 వేల మెజారిటీ వస్తదన్న నమ్మకం ఉంది. చెప్పలేం ఇంకా ఎక్కువే రావొచ్చు.
మ్యానిఫెస్టోపై ప్రజల స్పందన ఎలా ఉంది?
మా సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు స్వయంగా నేనే వెళ్లి ఇస్తుంటా. నా నియోజకవర్గంలో రెండువేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చినయ్. రానివారు సైతం.. వచ్చే విడతలో తప్పకుండా వస్తాయని నమ్మకంతో ఉన్నరు.
ప్రతిపక్షాల మీద మీ కామెంట్?
ప్రజలు అన్నీ చూస్తున్నరు. నా పని నేను చేసుకుంటూ పోతున్న. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. గతంలో చేయనోళ్లు ఇప్పుడు చేస్తరా అని వాళ్లే ప్రశ్నిస్తున్నరు.