కరీంనగర్ : ఈటల రాజేందర్ ఇచ్చే ప్రలోభాలకు ప్రజలు లొంగరని కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల ఇన్చార్జి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామంలో శుక్రవారం గ్రామ పెద్దలు, గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉన్నారని తెలిపారు.
ఈటల రాజేందర్ ఇచ్చే డబ్బులకు, కుట్టుమిషన్లు, గడియారాలు, కుంకుమ భరణిలకు ప్రజలు లొంగరని, ఇలాంటి చిల్లర ప్రయత్నాలను ఈటల రాజేందర్ మానుకోవాలని హితవు పలికారు. ఏడేండ్లు మంత్రిగా ఉండి కూడా పల్లెల్లో అభివృద్ధిని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదని ధ్వజమెత్తారు.
ప్రతి దాని మీద చిల్లర విమర్శలు చేయడం ఈటల రాజేందర్కు అలవాటు అయిందన్నారు. సమావేశంలో సుడా చైర్మన్ పీడీ రామకృష్ణారావు, సర్పంచ్ మట్ట రజిత, ఎంపీటీసీ రమ, మాజీ ఎంపీటీసీ రామిడి వీరారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కనుమండ్ల గణపతి, రాకేశ్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
యాదాద్రి ఆలయం అత్యద్భుతం : ఏపీ మంత్రి పేర్ని నాని
విమర్శల పాలవుతున్న ప్రగ్యా ఠాకూర్.. ఎందుకంటే.?
అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందిస్తాం