వర్ధన్నపేట, జూలై 16 : వరంగల్ జిల్లా వర్ధన్నపేట శ్మశానవాటికలో నీటి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం పట్టణానికి చెందిన ఓ వృద్ధురాలు మృతిచెందడంతో కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్మశానవాటికలో నీటి వసతి లేకకుటుంబసభ్యులు క్యాన్ల ద్వారా నీటిని తెచ్చుకొని స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బీఆర్ఎస్ హయాంలో శ్మశానవాటికలో బోర్లు వేయించి మోటర్లను ఏర్పాటు చేశారు. మోటర్లు మరమ్మతులకు రావడంతో స్నానాలకోసం అవస్థలు పడుతున్నా అధికారులు, పాలకులు
పట్టించుకున్న పాపానపోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.