వరంగల్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల విభాగంలో రూ. 42 లక్షలతో ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ యూనిట్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ భాస్కర్, ఎంపీ దయాకర్, ఎమ్మెల్యేలు నరేందర్, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్, బస్వరాజు సారయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.