హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): ప్రశ్నపత్రం లీకేజీ, గతంలో పాల్పడిన నేరాలకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పీడీ యాక్టు ప్రయోగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇలాంటి నేరస్థులు, అవినీతి రాజకీయ నాయకులనుంచి తెలంగాణ రాష్ర్టాన్ని రక్షించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. అధికారం కోసం బీజేపీ ఎంత నీచానికైనా ఒడిగడుతుందనేందుకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు.