హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి ఇతర రాష్ర్టాల నుంచి మద్యాన్ని అక్రమంగా తీసుకొస్తే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని అధికారులకు ఆబ్కారీ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదేశించారు. గురువారం సచివాయంలో మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్రాష్ట్ర రవాణా సర్వీసులైన కార్గో, ఇతర పార్సిల్ సర్వీస్ ద్వారా ఇతర రాష్ర్టాల మద్యం అక్రమంగా సరఫరా కాకుండా నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని చెప్పారు.
రాష్ట్రంలోకి అక్రమ మద్యం తరలించిన వారికి విధించే శిక్షను కూడా ఐదేండ్ల నుంచి ఏడేండ్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా లోతుకుంటలో అరుణ్కుమార్ శర్మ అక్రమంగా నిల్వ ఉం చిన 102 ఆర్మీ మద్యం బాటిళ్లను ఎక్సైజ్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.