హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సర్పంచ్ల పెండింగ్ బి ల్లులను వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన సీఎంకి లేఖ రాశారు. సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి నిధులు రాక ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 50 రోజులు కావొస్తున్నదని, దాదాపు 1,850 కోట్ల మంజూరుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో స్థానిక ప్రతినిధులు, సర్పంచులు ఆర్థిక, మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు.