మున్సిపల్ అధికారులకు సీడీఎంఏ ఆదేశం
హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని విజయవంతం చేయాలని అధికారులను సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. ఈ నెల 3 నుంచి 18 వరకు నిర్వహిం చనున్న పట్టణ ప్రగతిపై మంగళవారం మసాబ్ట్యాంక్లోని సీడీఎంఏ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
సత్యనారాయణ మాట్లాడుతూ పట్టణ ప్రగతిపై పూర్తిస్థాయి కార్యాచరణతో సిద్ధంగా ఉండాలన్నారు. పారిశుధ్యం, క్రీడా ప్రాంగణాలు , వైకుంఠధామాలు, సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.