హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సిఫారసుతో గురువారం పట్నం మహేందర్రెడ్డితో గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రమాణం చేయించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ రాజ్భవన్లో గవర్నర్తో భేటీ అయ్యారు. అనంతరం వేదిక వద్ద పట్నం మహేందర్రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గవర్నర్, సీఎం పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.
కార్యక్రమం తర్వాత గవర్నర్ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గవర్నర్, మంత్రివర్గ సభ్యులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు, ప్రజాప్రతిధులు, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారనంతరం మంత్రి పట్నం మహేందర్రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి ప్రగతిభవన్లో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.