హైదరాబాద్ : కేబినెట్ మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మహేందర్రెడ్డి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు.