రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం విస్తృతంగా ప్రాచుర్యంలోకి రానున్నది. అందుకు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంపై రాసిన ఎనిమిది పాటలను అందులో అప్లోడ్ చేశారు. ప్రముఖ పాటల రచయిత సుద్దాల అశోక్తేజ ‘జయహో మన ఊరు మన’ పాటను రాశారు. ‘కేసీఆర్ సారు.. ప్రారంభించినారు’ పాటను సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి గాజర్ల రమేశ్ రచించి, పాడారు.
‘ఎంతందంగా ముస్తాబవుతున్నదో నా సర్కారు బడి’ పాటను ప్రభుత్వ ఉపాధ్యాయుడు సాయిసిరి రచించగా, చిన్నారి సంకీర్తన పాడారు. ‘కదలి కదలి తరలిరండి మన ఊరు -మన బడి’ పాటను సాయిసిరి రాయగా, నందన్రాజ్ బొబ్బిలి ఆలపించారు. ఈ నెల 3 నుంచి 30 వరకు బడిబాట కార్యక్రమం, ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎనిమిది పాటలను బడిబాటలో వినియోగిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ ) : జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపిక ప్రక్రియను కేంద్ర విద్యాశాఖ చేపట్టింది. ఇందుకుగాను టీచర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
‘మన ఊరు -మన బడి అఫిషియల్’ పేరుతో రూపొందించిన యూట్యూబ్ చానల్లో త్వరలోనే బడుల చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేస్తారు. బడుల రూపురేఖలు ముందు ఎలా ఉండేవి.. కార్యక్రమం తర్వాత ఎలా మారాయో సూచించేలా చిత్రాలు, వీడియోలను అప్లోడ్ చేయనున్నారు.