హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని మరోసారి సోమవారం బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. కమిషన్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, అపెక్స్ కౌన్సిల్ ఇలా.. ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం బనకచర్లను నిర్మిస్తున్నదని, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నోటీసులో పేర్కొన్నారు.
గోదావరి నీళ్లను అక్రమంగా వినియోగించుకుంటూ.. తెలంగాణ నీటి హకులకు నష్టం కలిగిస్తున్నందున 267 పద్దు కింద సురేశ్రెడ్డి వాయిదా తీర్మానం నోటీసును రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్సింగ్కు ఇచ్చారు. అత్యవసర అంశం అయినందున బనకచర్ల అంశంపై చర్చించాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఏపీ సరారు చేస్తున్న జల దోపిడీపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఈ నెల 6న కూడా రాజ్యసభలో కేఆర్ సురేశ్రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.