హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): నూతనంగా నిర్మించే పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఈఆర్ అంబేదర్ పేరు పెట్టాలని, కరెన్సీ నోట్లపై ఆ మహనీయుడి ఫొటో ముద్రించాలని తెలంగాణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
అనంతరం కరెన్సీపై బీఆర్ అంబేదర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురామ్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడుతూ అంబేదర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదని, ఆ రాజ్యాంగంలో పొందుపరచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగిందని సీఎం కేసీఆర్ పదేపదే గుర్తుచేస్తారని శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడమే కాకుండా హైదరాబాద్లో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పుతున్నారని గుర్తుచేశారు.
కార్యక్రమంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మందా జగన్నా థం, కరెన్సీపై అంబేదర్ ఫోటో సాధన సమితి జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడు బొల్లి స్వామి, సలహాదారులు ఆళ్ల రామకృష్ణ, హర్యానా అధ్యక్షుడు చంద్రహాస్, ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు ఎస్ఎల్ పాల్, ఢిల్లీ అధ్యక్షుడు ప్రొ ఫెసర్ రమేశ్, సంజయ్ సన్నీ పాల్గొన్నారు.