హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ పాలన(Central BJP Rule) ఎమర్జెన్సీని తలపిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని మండిపడ్డారు.రాహుల్ గాంధీ( Rahul Gandhi) పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి(Dictatorship), అణచివేతకు నిదర్శనమని ఆరోపించారు.
ప్రజాస్వామిక పార్లమెంట్ వ్యవస్థలో ఈ రోజు చీకటి రోజ(Block day) ని అన్నారు. పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీ(BJP MP’s)లు ఉన్నారని, వారి సంగతి ఏమిటని ప్రశ్నించారు. వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని పేర్కొన్నారు.ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతున్నదని విరుచుకుపడ్డారు.
దేశాన్ని దోచుకునే దొంగల కోసమే బీజేపీ పని చేస్తుందని తెలిపారు.బీజేపీ ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తుందని విమర్శించారు. బీజేపీ చర్యలను ప్రజాస్వామిక వాదులు, ప్రజలు ఖండించి బీజేపీ కి తగిన బుద్ధి చెప్పాలని కోరారు.