హైదరాబాద్ : విద్యాబుద్ధులు నేర్పి సమాజానికి ఆదర్శంగా నిలువాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుకి (Teacher Rude behavior) తల్లిదండ్రులు దేహశుద్ధి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్(Mahabubabad )జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.
దీంతో బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియాజేశారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్కు చేరుకొని సదరు టీచర్కు దేహశుద్ధి చేశారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడుకి దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
మహబూబాబాద్ జిల్లా – తొర్రూరు మండలం హరిపిరాల గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు.. పాఠశాల వద్ద విద్యార్థినుల తల్లిదండ్రుల ఆందోళన… pic.twitter.com/wp5Zu5P8ON
— Telugu Scribe (@TeluguScribe) January 29, 2025