యాదాద్రి: శ్రావణమాసం మూడవ సోమవారం సందర్భంగా యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్దనీ సమేత రామ లింగేశ్వరస్వామికి పురోహితులు రుద్రాభిషేకం నిర్వహించారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమై న అవకాశం ఉండటంతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసిన వెంటనే యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రభాతవేళలో పరమశివున్ని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకమయ్యారు.
ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించా రు. విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుభ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్ర హాలకు కూడా అభిషేకం,అర్చన చేశారు. ప్రభాత వేళ జరిగే రుద్రా భిషేకంలో పాల్గొని శివుడిని ఆరాధించి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా శుభం చేకూరుతుందని భక్తుల విశ్వాసం. శివాలయం ప్రధాన పురోహితులు ఆధ్వర్యంలో విశేష పుష్పాలంకరణ జరిపారు.