హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): పంజాగుట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ దేశం విడిచి వెళ్లేందుకు సహకరించారంటూ తనపై నమోదైన కేసు లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాల ని కోరుతూ స్థానిక ఇన్స్పెక్టర్ బీ దుర్గారావు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో తనను పోలీసులు అరెస్టు చేస్తే తన కెరీర్కు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషన్లో పేరొన్నారు.