జక్రాన్పల్లి, ఫిబ్రవరి 5: నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) మంజూరుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన నిమ్మల నిఖిల్ జక్రాన్పల్లి మండలం తొర్లికొండలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం ఎన్వోసీ అవసరమని చెప్పడంతో స్థానిక పంచాయతీ కార్యదర్శి మనోహర్ను సంప్రదించాడు. రూ.15 వేలు లంచం ఇస్తేనే ఎన్వోసీ మంజూరు చేస్తానని సెక్రెటరీ చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. సోమవారం నిఖిల్ నుంచి కార్యదర్శి రూ.4 వేలు లం చం తీసుకుంటుండగా.. రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.