యాదాద్రి: యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ మూడోరోజుకు చేరింది. సంప్రోక్షణలో అతిముఖ్య ఘట్టమైన పంచ కుండాత్మక మహాక్రతువును వేదపండితులు మంగళవారం ప్రారంభించారు. మహాయాగంలో భాగంగా బుధవారం ఉదయం 9 గంటలకు యాగశాలలో శాంతి పాఠంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అనంతరం ద్వారతోరణం, ధ్వజకుంభారాధన, చతుఃస్థానార్చన, మూలమంత్ర హవనము, షోడష కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి కొనసాగనున్నాయి.
సాయంత్రం 6 గంటల నుంచి.. సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, ద్వారాతోరణ ధ్వజకుంభ ఆరాధన, మూల మంత్రి హవనములు, పంచగవ్యాధి వాసం, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు.