హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది నరహంతక భాష అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్గౌడ్ మండిపడ్డారు. పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎంగా రేవంత్ఘోరం గా విఫలమయ్యారని, అందుకే ఫ్యాక్షన్ రాజకీయాలకు దిగుతున్నారని ఆరోపించారు.
రాజధానికి కూతవేటు దూ రంలో ఒకే గ్రామంలో ఆరుగురు హత్యకు గురై 24 గంటలు గడిచినా, నిం దితుడిని గుర్తించలేని అసమర్థ ప్రభు త్వం రేవంత్రెడ్డిదని చురకలంటించారు. ఈ ఘటన నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీశ్లను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ భాషలో మాట్లాడటం దుర్మార్గమని మండిపడ్డారు.