జూన్ 5 వరకు కొనసాగింపు
రాష్ట్ర క్యాబినెట్ భేటీలో నిర్ణయం
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పల్లెప్రగతి 5వ విడత, పట్టణప్రగతి 4వ విడత మే 20 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన మంగళవారం ప్రగతిభవన్లో సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకొన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న వర్షాకాలంలో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోనున్నారు.
వేసవి సెలవుల అనంతరం జూన్ 12న ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో వాటిని పరిశుభ్రంగా తీర్చిదిద్దనున్నారు. పల్లెప్రగతి మొదటి విడత కార్యక్రమాన్ని 2019లో సెప్టెంబర్ 6 నుంచి అక్టోబరు 5 వరకు నిర్వహించారు. పట్టణ ప్రగతి మొదటిసారిగా 2020లో ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు కొనసాగింది.