Palla Rajeshwar Reddy | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుపై కేసులును పెట్టడాన్ని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నేతపై కేసు పెట్టడం అప్రజాస్వామికమన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి ఏడాదికాలం పూర్తి అయినా క్రమంలో తెలంగాణ ప్రజలకు ఏం చేయలేకపోయాడని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న హరీశ్రావుపై కావాలనే కేసు నమోదు చేశారన్నారు. ఇలాంటి కక్షపూరిత చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారు.
కాంగ్రెస్ పరిపాలనలో అకృత్యాలు నిత్య కృత్యమయ్యాయని, రేవంత్ సర్కారు కేసులకు, బెదిరింపులకు బీఆర్ఎస్ నేతలెవరూ భయపడరన్నారు. పది, పదిహేనేళ్లు ప్రజాక్షేత్రంలో ఉంటూ పోరాడిన చరిత్ర బీఆర్ఎస్దని.. ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పాలన వైఫల్యాలను బట్టబయలు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. హరీశ్రావు కాలిగోటికి సరిపోని వ్యక్తి.. సిద్దిపేటకు చెందిన చోటామోటా కాంగ్రెస్ నాయకుడితో ప్రభుత్వం అక్రమ కేసు పెట్టించిందన్నారు. కేసులు, పోరాటాలు బీఆర్ఎస్ నాయకులకు కొత్తకాదని, ఇలాంటి కక్షపూరిత చర్యలు మానుకోవాలని పల్లా రాజేశ్వర్రెడ్డి హెచ్చరించారు.