Palamuru Rangareddy Lift | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వెట్రన్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించనున్నారు. నార్లాపూర్ ఇన్టేక్ వెల్ వద్ద ఈ నెల 16న బటన్ నొక్కి బహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను ఎత్తిపోయనున్నారు. ఈ క్రమంలో అధికారులు వెట్కోసం అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. వెట్రన్ ట్రయల్స్లో భాగంగా మంగళవారం పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల తొలి పంప్హౌస్లోకి నీటిని అధికారులు విడుదల చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ను అధికారులు నీటిని వదిలారు.
అప్రోచ్ కెనాల్, హెడ్ రెగ్యులేటరీ, ఇన్టేక్ వెల్ నుంచి నార్లాపూర్లోని సర్పూజ్లోకి నీరు చేరుకున్నది. టెస్టింగ్ ద్వారా సర్జ్పూల్లో దాదాపు 20 మీటర్ల నీటిని అధికారులు విజయవంతంగా స్టోర్ చేశారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన పాలమూరు – రంగారెడ్డి జిల్లాలకు నీరందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మించిన కృష్ణా జలాలను ఎత్తిపోసి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు మళ్లించనున్నారు.